News

కేంద్ర ప్రభుత్వ తీరుతో నాకు సైటొచ్చేసింది


కేంద్ర ప్రభుత్వ తీరుతో తనకు సైటొచ్చేసిందని పవన్ అన్నారు. తన కళ్లజోడుకు కేంద్రం గ్రాంటు జారీ చేయాలని ఆయన కోరారు. సామాన్యులకు అర్థం కాని భాషను ఉపయోగించి ప్యాకేజ్ లెక్కలు చెప్పారని, దాని గురించి తెలుసుకోడానికి ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని పవన్ అన్నారు. అలాగే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని స్టడీ చేశానని, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులతో చర్చించానని పవన్ పేర్కొన్నారు. అనంతరపురంలో ఏర్పాటు చేసిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.